వెల్దండ, జూన్ 2: మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను ప్రజాప్రతినిధులు,అధికారులు, ఉపాధ్యాయులు, అన్నివర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై నర్సింహులు, సర్కిల్ కార్యాలయంలో సీఐ నాగరాజు, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ భూపతిరెడ్డి, సింగిల్విండో కార్యాలయంలో చైర్మన్ భాస్కర్రావు, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో మంజుల, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ విజయ, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ వెంకట్మ్రణ జాతీయ జెండాలు ఎగురవేశారు. మోడల్ పాఠశాల, పీహెచ్సీల వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ, పాఠశాలల్లో జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకొన్నారు. కేక్కట్ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.
తిమ్మాజిపేట మండలంలో..
తిమ్మాజిపేట, జూన్ 2: మండలంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యాలయలు, పాఠశాలు, పార్టీ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ పథాకాన్ని ఎగురవేశారు. మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ వేణుగొపాల్గౌడ్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ లీలావతి, టీఆర్ఎస్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు స్వామి, పీఏసీసీఎస్ వద్ద డీసీసీబీ డైరక్టర్ జక్కా రఘనందన్రెడ్డి, జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పాజిపల్లిలో సర్పంచ్ తిరుపతమ్మ, ఆర్సీతండాలో సర్పంచ్ గమ్లి, మారేపల్లిలో సర్పంచ్ నాగమణి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, ఎంపీడీవో కరుణశ్రీ, రైతుబంధు కమిటీ మండలాధ్యక్షుడు వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…
కల్వకుర్తి, జూన్ 2: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక ఇందిరానగర్లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సోనియాగాంధీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, విజయ్కుమార్రెడ్డి, జగన్, మిర్యాల శ్రీనివాస్రెడ్డి, అనిల్, షాకీర్నాని, చంద్రకాంత్రెడ్డి, పాండు, శ్రీను, ఆరీఫ్, శ్రీకాంత్ బాలరాజు, సతీశ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో..
కల్వకుర్తి మున్సిఫ్ మెడిస్ట్రేట్ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. కోర్డు ఆవరణలో న్యామయూర్తి మారం అర్పితారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. న్యాయవాదులు వెంకట్గౌడ్, జమీల్ అహ్మద్, నాగరాజు, కృష్ణయ్య, భాస్కర్రెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా భవననిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
చారకొండ మండలంలో..
చారకొండ, జూన్ 2: మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిరాబండరంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో ఎంఆర్వో నాగమణి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ నిర్మల, ప్రాథమిక సహకార కార్యాలయం వద్ద చైర్మన్ గురువయ్యగౌడ్, పీహెచ్సీ వద్ద వైద్యురాలు రూప, పశువైద్యశాల వద్ద వైద్యురాలు యమున, పీఎస్ వద్ద ఎస్సై కృష్ణదేవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జూపల్లిలో వైస్ఎంపీపీ బక్కమ్మయాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు వెంకటయ్యయాదవ్, బాలేమియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్య, ఎంపీడీవో జయసుధ, ఎంపీవో నారాయణ, డీటీ అలీ, ఆర్ఐ శ్రీనివాస్రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో..
కందనూలు, జూన్ 2: జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అధికారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య తమ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తోటి అధికారులు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధలను పాటిస్తూ తక్కువ మందితో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీశైలం, సీఈవో ఉష, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఊర్కొండ మండలంలో..
ఊర్కొండ, మార్చి 2: ఎంపీడీవో కార్యాలయం వద్ద, ఊర్కొండ స్టేజీ వద్ద ఎంపీపీ రాధాజంగయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శాంతకుమారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిరినాయక్, కో ఆప్షన్ సభ్యుడు ఖలీంపాషా, సర్పంచ్ రాజయ్య, ఉపసర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు గోపి, శ్రీను, ప్రసాద్తోపాటుపాల్గొన్నారు.
బిజినేపల్లిలో..
బిజినేపల్లి, జూన్ 2: మండలంలోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. పీఎస్లో ఎస్సై వెంకటేశ్ , రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ అంజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వట్టెంలోని నవోదయ పాఠశాల, పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాల, జిల్లా వైద్యారోగ్య శాఖకార్యాలయం, ఆర్టీసీ జిల్లా కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలకపల్లి మండలంలో..
తాడూరు, జూన్ 2: మండలంలో బుధవారం రాష్ట్ర అవతరణ వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, ఎంపీడీవో, తాసిల్దార్, గ్రామపంచాయతీ, సింగిల్ విండో కార్యాలయం, వ్యవసాయ అధికారి కార్యాలయం, ఎంఈవో కార్యాలయం, పోలీస్స్టేషన్ల ఎదుట అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవితోపాటు వైస్ఎంపీపీ శివలీల, ఎంపీడీవో గంగమోహన్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై వీరబాబు, సింగిల్విండో చైర్మన్ ఎండీ సమద్పాషాతోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, పాపగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ శివ, డీలర్ రాములు, వెంకటయ్య, గోవర్ధన్, తాహెర్, యూసుఫ్తోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వంగూరు మండలంలో..
వంగూరు, జూన్ 2: రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ రాజునాయక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భీమమ్మ, పోలీస్స్టేషన్లో ఎస్సై బాలకృష్ణ, వ్యవసాయ కార్యాలయంలో ఏవో తనూజ, రంగాపూర్ సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ సురేందర్రెడ్డి, లయాల వద్ద సర్పంచులు జాతీయ జెండాను ఎగరవేశారు.