నిరసనల ‘మోత’

మన్ కీ బాత్కు కౌంటర్గా పళ్లాలు మోగించిన రైతులు
న్యూఢిల్లీ/చండీగఢ్, డిసెంబర్ 27: ప్రధాని ‘మన్ కీ బాత్' కార్యక్రమం సందర్భంగా రైతులు వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం ఈ కార్యక్రమం రేడియోలో కొనసాగుతున్నంత సేపు పళ్లాలు మోగించారు. ‘మోదీ మన్ కీ బాత్ వినీవినీ అలసిపోయాం. ప్రధాని రైతుల మన్ కీ బాత్ విననప్పుడు ఆయన మన్ కీ బాత్ను మేము ఎందుకు వినాలి?. అందుకే ఈ పళ్లాల చప్పుడు. ఈ శబ్దానికి మోదీ ఎంత చెప్పినా మాకు వినపడదు’ అని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. కరోనాను అడ్డుకోవడానికి ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, ఇతరులను గౌరవించడానికి గిన్నెల చప్పుడు చేయాలని గతంలో మోదీ పిలుపునిచ్చారని, తమ మన్ కీ బాత్ వినని ప్రధానికి పళ్లాల చప్పుడుతో నిరసన తెలుపుతున్నామని రైతు నేత రాకేశ్ తికాయత్ తెలిపారు. తాజాగా పంజాబ్లో అంబానీ, అదానీలకు చెందిన మరో 150 టెలికం టవర్లను ధ్వంసం చేశారు. వీటితో కలుపుకొని ఇప్పటి వరకు ధ్వంసమైన టవర్ల సంఖ్య దాదాపు 1,338కి చేరింది.
తల్లికి పుట్టినోడు ఎవరైనా సరే రైతుల భూమిని లాక్కోలేడు. కొంతమంది అమాయక రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
- రాజ్నాథ్ సింగ్
తాజావార్తలు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!
- హైవేపై ఎస్యూవీ నడిపిన ఐదేళ్ల చిన్నారి
- సీసీఎంబీ నేతృత్వంలో ఆర్టీ-పీసీఆర్ వర్క్షాప్లు
- ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- రైతులకు వ్యతిరేకంగా సింఘూలో స్థానికుల ఆందోళన
- వాట్సాప్ డెస్క్టాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్
- దేశం అబ్బురపడేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
- శృతిహాసన్ ప్రియుడు ఇతడే..ఫాలోవర్స్ కు క్లారిటీ!
- విద్యుత్ సరఫరా నిలిపివేస్తే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తాం: రాకేశ్
- అయోధ్య మసీదుకు చందాలు ఇవ్వొద్దు: అసదుద్దీన్ ఓవైసీ