అమృత్సర్, ఆగస్టు 2: కరోనా రోగుల కన్నీటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్నదని అమృత్సర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కండ్లకలక వల్ల కంటి నుంచి వచ్చే స్రావాల్లో సార్స్-కొవ్-2 ఉన్నట్టు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. 120 మంది రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు చెప్పారు. కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నప్పుడు నేత్ర వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే, నోటి తుంపర్ల ద్వారానే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు గుర్తుచేశారు.