లక్నో : కరోనా ఎక్కడుంది..? మాస్కులు కట్టుకోవడం అవసరమా..? కరోనా ఎప్పుడో తోక ముడిచింది.. అంటూ వెక్కిరింత మాటలు మాట్లాడిన ఓ ఎమ్మెల్యే.. అదే వైరస్ గురై ప్రాణాలు వదిలారు. అదికూడా ఓ ఎమ్మెల్యే అయి ఉండి కూడా 24 గంటల పాటు ఐసీయూ దొరకని పరిస్థితిలో సరైన వైద్యం అందక చనిపోయారు. ఈయన చనిపోయిన 2 రోజుల తర్వాత ఆయన దయనీయస్థితి సోషల్ మీడియాతో వెలుగులోకి వచ్చంది.
ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలోని నవాబ్గంజ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గంగ్వార్ తొలి దశ కరోనా సంక్రమణ సమయంలోనూ విచ్చలవిడిగా తిరిగారు. రెండో దశలోనూ మాస్క్ ధరించకుండా.. కరోనా ఎక్కడున్నదంటూ వెకిలిగా మాట్లాడుతూ చివరకు దానికే బలయ్యాడు. ఈనెల 10 వ తేదీన బరేలిలోని రామ్మూర్తి వైద్యకళాశాల దవాఖానలో పరీక్ష చేయించుకోగా కేసర్ సింగ్ కరోనా పాజిటివ్గా తేలారు. అయితే, 24 గంటలపాటు ఆయనకు ఐసీయూలో బెడ్ లభించలేదు. దాంతో ఆయనకు సరైన వైద్యం అందడం లేదని భావించిన కుటుంబసభ్యులు నోయిడాలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఈనెల 28 న మరణించారు.
తనకు కరోనా వైరస్ సోకిందని, ప్రస్తుతం బరేలిలోని రామ్మూర్తి దవాఖానలో చికిత్స తీసుకుంటున్నానని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్కు రాసిన లేఖలో ఎమ్మెల్యే కేసరి సింగ్ తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున ఢిల్లీలోని మ్యాక్స్ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించేలా చూడాలని ఆయన కోరారు. అయినప్పటికీ ఆరోగ్యమంత్రి పేషీలో ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ లేఖను ఆయన చనిపోవడానికి 10 రోజుల ముందు రాశారు.
తన తండ్రి లాంటి ఎందరో కరోనా బారిన పడి చనిపోతున్నా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది ముమ్మాటికీ ఆయన వైఫల్యమే అని కేసర్ సింగ్ కుమారుడు విశాల్ గంగ్వార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి పలు సార్లు ఫోన్ చేసినా పట్టించుకునే వారే కరువయ్యారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఉత్తరప్రదేశ్లో కరోనా వైరస్ బారిన పడి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు మరణించారు. కేసర్ సింగ్ కన్నా ముందు ఏప్రిల్ 23 న లక్నో పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సురేష్ శ్రీవాస్తవ కన్నుమూశారు. ఆరయ్య సదర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రమేష్ దివాకర్ అదే రోజు మరణించారు. ఫస్ట్ వేవ్లో క్యాబినెట్ మంత్రులు చేతన్ చౌహాన్, కమల రాణి వరుణ్ చనిపోయారు.
సినిమా మరిచిపోలేని మహా మనీషి.. చరిత్రలో ఈరోజు
సెంకాకు ద్వీపాన్ని సర్వే చేసిన చైనా.. మరోసారి జపాన్తో ఉద్రిక్తత
తక్కువ లక్షణాలున్న కరోనా రోగులపై ఈ ఔషధం ప్రభావవంతం: ఆయుష్ మంత్రిత్వ శాఖ
బోర్డర్ రోడ్ ఆర్గనేజన్లో తొలి మహిళా అధికారిగా వైశాలి నియామకం
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్బీఐ దాడులు
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..