ఆలేరు టౌన్, ఏప్రిల్ 26 : ఆలేరు పట్టణానికి చెందిన ప్ర ముఖ కవి, దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామాను జయ్య (76) గుండెపోటుతో ఆదివారం రాత్రి కన్నుమూశా రు. తిరునగరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా, రాజా పేట మండలం, బేగంపేట గ్రామం. తిరునగరికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు కొద్ది సంవత్సరాల కింద గుండెపోటుతో చనిపోయాడు. తిరునగ రి సెప్టెంబర్ 24, 1945లో జన్మించాడు. భారత్ భాషా భూషణ్ (2008), కవి తిలక అనే బిరుదులు ఉన్నాయి. సుమారు 35 సంవత్సరాలు ఉన్నత పాఠశాలల్లో ప్రథమ శ్రేణి తెలుగు పండితుడిగా, చివరి 2 సంవత్సరాల్లో జూ నియర్ లెక్చరర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇతడు బాలవీర (శతకం), శృంగార నాయికలు (ఖండ కా వ్యం), కొవొత్తి, అక్షరధార, వసంతం కోసం, గుండెలోంచి, ముక్తకాలు, మా పల్లె, మనిషి కోసం, వాని-వాడు, ఈ భూ మి, ప్రవాహిని, ఉషోగీతా, ఒకింత మానవత కోసం, యా త్ర, కొత్త లోకం వైపు, (వచన కవిత సంపుటిలు). తిరునగ రీయం, నీరాజనం, (పద్య కవితా సంపుటి) తదితర పద్య, వచనా, కవితా సంపుటిలు రచించారు. అలాగే వివిధ పత్రి కల్లో వెయ్యికి పైగా సాహిత్య వ్యాసాలు, విమర్శలు రాశా రు.
అంతేకాకుండా ప్రపంచ తెలుగు మహాసభల సంద ర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కారం (1975), ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి గా సత్కారం (1976,1978) యాదగిరిగుట్ట దేవస్థానం పండిత సత్కారం (1992), బీఎన్రెడ్డి సాహిత్య పుర స్కారం (1994), గిడుగు తెలుగు భాష సాహిత్య పురస్కా రం (2017), అభినందన సినారె సాహిత్య పురస్కారం (2019), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి సాహితి పుర స్కారం -2020 ఆగస్టు 15న ప్రగతి భవన్లో సీఎం కేసీఆ ర్ చేతులగా మీదుగా అందుకున్నారు. అదేవిధంగా తిరున గరి జీవితం- సాహిత్యం అన్న అంశాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పరిశోధనలు జరిగాయి. ప్రైవేటు ఆల్బమ్స్ భక్తి గీతాలు, ప్రభోద గీతాలు రాశాడు. తిరునగరి మృతిపట్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డా. పోరెడ్డి రంగయ్య, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకర య్య పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో తిరునగరి
యాదాద్రి: మానవీయతను భూమికగా చేసుకుని ఆధ్యాత్మి క దార్శనిక భావ జాలంతో ఐదు దశాబ్దాలకు పైగా సాహితీ సృజన చేస్తున్న ప్రముఖ సాహితీవేత్త, దాశరథి అవార్డు గ్రహీత, డాక్టర్ తిరునగరి రామానుజయ్యకు లక్ష్మీనరసిం హస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సముచ్చిత స్థానం ఉంది. యాదాద్రిశుడి సన్నిధిలో బ్రహ్మోత్సవాల కాలంలో జరిగిన దశబ్ధాల పాటు ధార్మిక, సాహిత్య, సంగీత సభలోని కవి సమ్మేళనంలో డాక్టర్ తిరునగరి అధ్యక్షతన ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధా ర్మిక సభల్లో కవిగా, ధార్మిక ఉపన్యాసాల వక్తగా అనేకమార్లు పాల్గొన్నారు. యాదాద్రి భువవనగిరి జిల్లాలో రాజాపేట మండలం బేగంపేటలో జన్మించిన తిరునగరి తెలుగు ఉ పాధ్యాయుడిగా, ఆధ్యాపకుడిగా పనిచేసి, 1999లో పదవీ విరమణ పొందారు. ఉద్యోగరీత్యా ఆలేరులో స్థిరపడి నప్పటికీ ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటు న్నారు. సాహితీవేత్తగానే కాకుండా గొప్పవక్తగా ఆయ న సుప్రసిద్ధ్దులు. తెలుగు సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యతతో కూడిన ఆయన ప్రసంగాలు సాహితీలోకానికి సుపరిచితమే. కవిత్వం, పద్యం, విమర్శ, వ్యాఖ్యనం ఏది రాసిన తనదైన ప్రత్యేక ము ద్రను సంతరించుకుంటుంది. తెలుగు సాహిత్య రం గంలో డాక్టర్ తిరునగరి పేరుతో 5 దశాబ్దాలుగా రచ నలు చేసిన ఆయన ఆదివారం హైదరాబాద్లోని ఆ యన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆ యన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.