న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఖచ్చితంగా జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సమావేశాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సమావేశ వ్యవధిని కేబినెట్ మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులకు టీకాలు వేయించామన్నారు. 445 మంది సభ్యులు కూడా తమకు తాముగా టీకాలు తీసుకున్నారని ఓం బిర్లా తెలిపారు. మిగిలిన సభ్యులు, ఉద్యోగులకు త్వరలో టీకాలు వేస్తారని చెప్పారు. పార్లమెంటు పని, ఉత్పాదకతను పెంచడానికి తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు.