భోపాల్ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతమవుతుండటంతో ఆక్సిజన్ కోసం రాష్ట్రాలు తగువులాడుకోవాల్సి వస్తున్నది. తాజాగా ఒక రాష్ట్రానికి చెందిన ఆక్సిజన్ ట్యాంకర్ను పొరుగు రాష్ట్రం అధికారులు నిలిపివేయడంతో సమస్య ఇబ్బందికరంగా తయారైంది. దాంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. ఆపత్కాలంలో ఆదుకునే ఆక్సిజన్ను అడ్డుకోవడం నేరం అని తెలిసినప్పటికీ ఉన్నతాధికారులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్లో రోగుల సంఖ్య భారీగా పెరుగడంతో ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువైంది. రాష్ట్రంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల రోగులు మరణిస్తున్న కేసులు ఒకవైపు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్కు చెందిన ఆక్సిజన్ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల్లో నిలిపివేయడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. ఝాన్సీ, మోదీనగర్ వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లను అధికారులు నిలిపేశారు.
దాంతో సరైన సమయానికి ఆక్సిజన్ అందుబాటులోకి రాక మధ్యప్రదేశ్లో అనేక మంది పేషెంట్లు ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకు ఆలస్యమైందని అధికారులు ఆరా తీయగా.. పొరుగురాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను నిలిపివేసినట్లు తేలింది. దాంతో విషయం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు చేరవేశారు.
దాంతో రంగంలో దిగిన శివరాజ్సింగ్.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడారు. అప్పుడు అధికారులు ఆక్సిజన్ ట్యాంకర్లను వదిలిపెట్టారు. అదేవిధంగా గుజరాత్లో కూడా ట్యాంకర్ ఆగిపోయింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో కూడా ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
ఈ సంఘటనలను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మంత్రులతో నిర్వహించిన సమావేశంలో పంచుకున్నారు. దేశంలో కరోనా ఇన్పెక్షన్ పెరుగుతున్నందున నిత్యం ఇలాంటి సమస్యలు వచ్చేలా ఉన్నందున శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు మంత్రులు సూచించారు. ఆక్సిజన్ ట్యాంకర్లతో ఎంపీ పోలీసులకు బదులుగా సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించడానికి హోం మంత్రిత్వ శాఖతో చర్చించాలని మరో మంత్రి చెప్పినట్లుగా తెలుస్తున్నది.
ఈ సమావేశం అనంతరం ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ‘కరోనా కేసులు పెరుగుతున్నాయి. సంక్షోభం ఉంది. ఇటువంటి పరిస్థితిలో కొన్ని రాష్ట్రాల అధికారులు ఆక్సిజన్ ట్యాంకర్లను ఆపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..