న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లోని సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతాబలగాలపై మావోయిస్టుల దాడికి సంబంధించిన ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ స్పందించారు. మావోయిస్టుల పలువురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమర జవాన్ల ప్రాణ త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని పేర్కొన్నారు.
శనివారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లిన భద్రతాసిబ్బందిపై మావోయిస్టులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ మధ్యాహ్నం వరకు అందిన సమాచారం ప్రకారం ఘటనలో మొత్తం 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 43 మంది గాయపడ్డారు. మరో 21 మంది జవాన్లు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్: కేంద్రం
ఛత్తీస్గఢ్లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?