లక్నో : కొవిడ్-19 కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధంగా, వ్యూహాత్మకంగా చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ పనులు సాఫీగా సాగేలా నెల రోజుల ముందుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మహమ్మారి నియంత్రణకు సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అబ్జర్వేషన్ గదులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయా కేంద్రాల్లో రద్దీ లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లను ఎట్టి పరిస్ధితుల్లో వ్యర్ధం కాకుండా చూసుకోవాలన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో యూపీలో రికార్డు స్థాయిలో 2,97,327 కరోనా టెస్టులు నిర్వహించారు.