న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ స్పష్టంచేశారు. తాము నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యపై మాట్లాడటం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేదని ఆయన చెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనుండటంతో ఇక తాము పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించామని రాకేష్ తికాయిత్ తెలిపారు. రోజుకు 200 మంది చొప్పున ఢిల్లీకి వెళ్లి ఈ నెల 22న పార్లమెంట్ బయట ఆందోళనకు దిగుతామని ఆయన స్పష్టంచేశారు.