తిరుమల: హిందూ ధర్మ ప్రచారం కోసం విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి ప్రారంభించిన ప్రచారయాత్ర బుధవారం తిరుమలలో ముగిసింది. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన 1200 మందికి పైగా గిరిజనులు, దళితులతో కలిసి తిరుమల పిఏసి-3 నుంచి పాదయాత్రగా వెళ్లిన శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్రస్వామి మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని పరిరక్షించి మతమార్పిడులను అరికట్టేందుకు గిరిజన ప్రాంతాల్లోని హిందువులను చైతన్యపరచడం కోసం 2019లో హిందూ ధర్మ ప్రచార యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని నిర్మూలించి ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు.