ఢిల్లీ,జూన్ 12:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) శ్రీనగర్ లోని ఖోన్మోహ్ వద్ద 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని17 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసింది. పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా దీనికి నిధులు సమకూరుతాయి. వెంటిలేటర్లతో 125 ఐసియు పడకలు ఉన్నాయి. వీటిలో 25 ప్రత్యేకంగా పిల్లలకు కేటాయించారు. 62 కెఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకుల నుంచి మొత్తం 500 పడకలకు నిరంతర ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉంది. ఆసుపత్రి నిర్వహణ, వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన విభాగం సమకూరుస్తుంది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక బ్లాక్ లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో సరైన అగ్నిమాపక విభాగం, మార్చురీ, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.