సూర్యాపేట : కరోనా సెకండ్ వేవ్ నియంత్రణపై సూర్యాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహింరు. కరోనా చికిత్స, నివారణ చర్యలు, మందుల పంపిణీ తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, డీఎంహెచ్వో కోటాచలం, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.