రీవా: భూములను లాగేసుకుని, ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వ్యాపారులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని బీకేయూ నేత రాకేశ్ సింగ్ టికయిత్ ఆరోపించారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని రీవాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రాన్ని నిలదీయడంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని మండిపడ్డారు.