హైదరాబాద్ : ఆన్లైన్ ట్రేడింగ్లో తక్కువ పెట్టుబడి పెట్టండి.. అందుకు భారీ లా భాలిస్తాం అంటూ నమ్మించి.. నగరానికి చెందిన ఓ మహిళ కు రూ. 1.2 కోట్లు టోకరా వేశారు. ఈ ముఠాలోని ఇద్దరిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. గత ఏడాది నవంబర్ 19న అబిడ్స్కు చెందిన ఓ మహిళకు ఫేస్బుక్లో ‘సాక్షి మెహెత’ పేరుతో పరిచయం అయిన ఓ మహిళ.. తాము షేర్ ట్రేడింగ్ బిజినెస్ కన్సల్టెంట్ అంటూ చెప్పుకుంది. తాము షేర్ మార్కెట్ వ్యాపారంతో ట్రేడింగ్ రిసెర్చ్ కూడా చేస్తుంటా మని, మా కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉందంటూ చెబుతూ బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకుంది. మరునాడు ట్రేడింగ్ నుంచి అంటూ సైబర్ నేరగాళ్లు బాధితురాలికి ఫోన్ చేసి.. మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే.. కోట్ల రూపాయల లాభాలు వస్తాయంటూ నమ్మించి… మొదట ఆమె నుంచి రూ.5లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత మీరు పెట్టిన రూ.5లక్షలకు రూ.88లక్ష ల లాభం వచ్చిందంటూ నమ్మిం చారు. వచ్చిన లాభాన్ని తీసుకోవాలంటే కొన్ని పన్నులు చెల్లించాలంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా ఆమె నుంచి రూ.1.2 కోట్లు కాజేశారు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితురాలు మార్చి 1న సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ హరిభూషన్ నేతృత్వంలో ఎస్సై కృష్ణ బృందం దర్యాప్తు చేపట్టింది.
మధ్యప్రదేశ్లో ఇద్దరు నిందితులు అరెస్ట్
కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతాలు, ఫోన్ కాల్స్ ను ఆరా తీసిన సైబర్క్రైమ్ పోలీసులు.. వాటి ఆధారంగా నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన వారుగా గుర్తించారు. మధ్యప్రదేశ్, ఇండోర్కు చెందిన రాహుల్ సిరస్వాల్ అలి యాస్ రాహుల్, మహేశ్ దేవ్లు మరికొంత మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కొందరు కాల్సెంటర్ ఏర్పాటు చేసి ఫోన్లు చేస్తుండగా.. మరికొందరు బ్యాంకు ఖాతాలు నిర్వహి స్తున్నారు. రాహుల్, మహేశ్ కూడా బ్యాంకు ఖాతాలు నిర్వహస్తున్నారు. వీళ్ల ఖాతా లోకి దఫ దఫాలుగా భారీ మొత్తంలో బాధితు రాలు డబ్బులు డిపాజిట్ చేసింది. బాధితు రాలి నుంచి డబ్బు డిపాజిట్ కాగా నే వాటిని డ్రా చేసి… అందరూ పంచు కు న్నారు. పోలీసుల దర్యాప్తులో ఇద్దరు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఇండోర్లో వారిద్దని అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు. ఈ నిందితులపై చత్తీస్ఘడ్లోనూ రెండు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.