ముంబై: మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలంటూ జీవించి ఉన్న వ్యక్తికి అధికారులు ఫోన్ చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది. చంద్రశేఖర్ దేశాయ్ అనే వ్యక్తికి థానే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫోన్ వచ్చింది. తన డెత్ సర్టిఫికెట్ను తీసుకెళ్లాలని అధికారులు తనతో చెప్పినట్లు ఆయన ఆరోపించారు. కాగా ఈ జాబితా తమకు పూణె కార్యాలయం నుంచి అందిందని థానే డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మరణించిన వారి జాబితాలో ఆ వ్యక్తి పేరు ఉండటం సాంకేతిక లోపమని అన్నారు. జాబితాను ధృవీకరించిన తర్వాతే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేయాలని తమ సిబ్బందికి ఆదేశించినట్లు ఆయన చెప్పారు.