కాచిగూడ,జూన్ 3: ప్రజలకు అవసరమైన వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని వసతుల కల్పనలో రాజీలేదుఅంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని సుందర్నగర్ఏ,బీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి గురువారం అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు పర్యటించి స్థానిక ప్రజల నుంచి నూతన సీసీ రోడ్లు, వీధిలైట్లు, లోప్రెషర్ వాటర్, డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సుందర్నగర్ బస్తీలో ఏళ్లనాటి తుప్పుపట్టిన డ్రైనేజీ పైపులైన్ల ద్వారా కలుషిత నీళ్లు వస్తున్నాయని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన ఎమ్మెల్యే సుందర్నగర్లో ఏళ్లనాటి డ్రైనేజీని తొలగించి నూతన పైపులను వేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. అంబర్పేట నియోజకవర్గంలోని మురుగు ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్లు నేటి జనాభా అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గోల్నాక అధ్యక్షుడు భరత్రాజ్ ముదిరాజ్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, జలమండలి ఏఈ శేఖర్, ప్రతాప్, శ్రీకాంత్, లక్ష్మి ముదిరాజ్, పి.సంతోశ్, మహేశ్, మురళి, యూసుఫ్శరీఫ్, సబేర్, సాయి తదితరులు పాల్గొన్నారు.