National
- Nov 28, 2020 , 14:22:36
ప్రజాస్వామ్య ప్రక్రియను ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారు : ఆర్మీ చీఫ్

హైదరాబాద్: దేశ పశ్చిమ సరిహద్దుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఉగ్రవాదం ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిందని, అనేక ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదం తగ్గడంలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తెలిపారు. జమ్మూకశ్మీర్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శీతాకాలం ప్రవేశించడంతో.. సరిహద్దుల వద్ద చొరబాటు సంఘటనలు పెరిగినట్లు ఆయన చెప్పారు. మంచు తీవ్రత పెరగకముందే ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తారన్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న టన్నెళ్ల నుంచి ఉగ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని నరవాణే తెలిపారు.
తాజావార్తలు
- వీడీసీసీతో సమస్యలుండవ్
- పారిశ్రామిక వాడలో పచ్చదనం
- పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి
- స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
- సామాన్యుడిలా సంజయ్కుమార్
- వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్ కప్' టోర్నీ
- ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగానే పోటీలు
- ఊర చెరువుకు పైపులైన్ వేయించాలి
- రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి
MOST READ
TRENDING