శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శ్రీనగర్ పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ అధికారి మరణించారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో ఖన్యార్లోని పోలీస్ తనిఖీ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారి తెలిపారు. ఖన్యార్ పోలీస్ స్టేషన్కు చెందిన ప్రొబేషనరీ సబ్ ఇన్స్స్పెక్టర్ అర్షిద్ అహ్మద్ ఈ ఘటనలో గాయపడినట్లు చెప్పారు. ఆయనను సౌరాలోని షెరీ కశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు వివరించారు. కాల్పుల జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.