శ్రీనగర్ : సోమవారం జమ్ముకశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డ లష్కరే తాయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రర్తో పాటు మరో పాకిస్థాన్ ఉగ్రవాది మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. విచారణ సందర్భంగా పోలీసులు నదీమ్ను ప్రశ్నించగా మలూరలోని తన ఇంటిలో ఏకే-47 రైఫిల్ను ఉంచానని తెలిపాడు. దానిని స్వాధీనం చేసుకునేందుకు నదీంను తీసుకొని పోలీసులు వెళ్లారు. అయితే, వారు ఇంట్లోకి వెళ్తుండగా.. లోపల దాక్కున్న మరో ఉగ్రవాది పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ ఉగ్రవాదితో పాటు నదీమ్ కూడా హతమయ్యాడు.