యూపీలో ఘోర దుర్ఘటన.. శ్మశానవాటిక పైకప్పు కూలి 21 మంది దుర్మరణం

ఘజియాబాద్ : ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ జిల్లా మురద్నగర్లోని ఓ శ్మశాన వాటిక ఘాట్ భవన సముదాయం పైకప్పు కుప్పకూలి 21 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించి సమీప దవాఖానలకు తరలించారు. భారీ వర్షం కారణంగా భవనం పిల్లర్ ఒక్కసారిగా కూలడంతో పైకప్పు కుప్పకూలి ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన బంధువులు వర్షం కారణంగా శ్మశాన వాటికలోని భవనం కిందకు చేరారు. అదే సమయంలో భవనం కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్తోపాటు ఎస్పీని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాద జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్ కింద 40 మందిపైగా ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
UP CM Yogi Adityanath takes cognizance of roof collapse incident in Muradnagar, Ghaziabad district.
— ANI UP (@ANINewsUP) January 3, 2021
"I've instructed district officials to conduct relief operations & submit a report of incident. All possible help will be provided to those affected by the incident," he said. pic.twitter.com/3Kt6ECqIz7
गाजियाबाद: मुरादनगर में बारिश की वजह से छत गिरी, क़रीब 10-12 लोगों के फंसे होने की आशंका है। बचाव अभियान चल रहा है। pic.twitter.com/1WUHO5MLys
— ANI_HindiNews (@AHindinews) January 3, 2021