National
- Jan 22, 2021 , 15:11:15
VIDEOS
లాకర్లో లక్షల్లో డబ్బుల కట్టలు.. తినేసిన చెదలు

అహ్మదాబాద్: బ్యాంక్ లాకర్లో దాచుకున్న లక్షలాది డబ్బుల కట్టలను చెదలు తినేశాయి. దీంతో ఒక కస్టమర్ లబోదిబోమంటూ బ్యాంకు అధికారులను ఆశ్రయించాడు. చెదలవల్ల నష్టపోయిన డబ్బును తనకు చెల్లించాలని డిమాండ్ చేశాడు. గుజరాత్లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. రెహ్నా కుతుబీద్దీన్ దేసర్వాల్ అనే వ్యక్తి ప్రతాప్ నగర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ లాకర్లో రూ.2.20 లక్షల నగదును దాచుకున్నాడు. అయితే ఇటీవల లాకర్ను తెరిచి చూడగా ఆ డబ్బుల కట్టలకు పట్టిన చెదలు నోట్లను తినేశాయి. దీంతో అతడు దీని గురించి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. తాను నష్టపోయిన డబ్బులను బ్యాంక్ చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా డబ్బులను బ్యాంక్ లాకర్లో దాచుకున్నప్పటికీ రక్షణ ఉండదని ఇలాంటి ఘటనల ద్వారా తెలుస్తున్నది.
తాజావార్తలు
- సమన్వయంతో పనిచేస్తే పన్నుల వసూళ్లలో పురోగతి
- ప్రసవం తర్వాత కుంకుమ పువ్వు తినడం మంచిదేనా?
- మార్చి 2 నుంచి ఖమ్మంలో అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు
- 'పల్లా'కు సంపూర్ణ మద్దతు : ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
- కన్ను గీటిన కైరా అద్వానీ..వీడియో
- స్నేహితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్నందుకు హత్య
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్కు యూసుఫ్ పఠాన్ గుడ్బై
MOST READ
TRENDING