కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ బాంబు దాడిలో 40 మంది మరణించారు. మరో 52 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఈ సమాచారాన్ని అందజేసింది. కాబూల్ జిల్లాలోని దస్తార్-ఎ-బార్చిలోని సయ్యద్ అల్ షుహాదా బాలికల ఉన్నత పాఠశాల వల్ల పేలుడు జరిగింది. ఈ సమయంలో బాలికలు పాఠశాల నుంచి ఇళ్లకు బయల్దేరుతున్నారు. మొదట కార్ బాంబు పేలింది. తర్వాత రెండు రాకెట్లను పేల్చారు. అయితే, ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ పేలుళ్లకు బాధ్యత తీసుకోలేదు.
ఈ దాడిలో 40 మంది మరణించారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ తెలిపారు. క్షతగాత్రులను వివిధ దవాఖానల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా కొనుగోళ్లు చేసేందుకు ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షియా హజారా వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు.
సెప్టెంబరు 11 నాటికి అన్ని యూఎస్ దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా గత నెలలో ప్రణాళికలు ప్రకటించినప్పటి నుంచి కాబూల్ లో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా తాలిబాన్లు తమ దాడులను వేగవంతం చేశారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు.
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు
యురోపియన్ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ
25 సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెలకొల్పాడు..
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్కు బైడెన్ ఆహ్వానం
పాకిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతి
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..