న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్లు, విమానాల రద్దు కారణంగా మనదేశంలో చిక్కుబడిపోయిన విదేశీయుల వీసాలు ఆగస్టు 31 వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వారెవరూ వీసాల గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వీసాల గడువు దాటిపోయినా ఎలాంటి జరిమానాలు లేకుండా ఆగస్టు 31 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నది. విదేశీయులు దేశం విడిచి వ వెళ్లేముందు ఎగ్జిట్ పర్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి జరిమానాలు లేకుండా అనుమతి లభిస్తుందని హోంశాఖ పేర్కొన్నది. కరోనా సెకండ్వేవ్ కారణంగా భారత్కు అనేక దేశాలు విమానాల రాకపోకలు హటాత్తుగా నిలిపివేసిన ఫలితంగా వివిధ దేశాల పౌరులు మనదేశంలో చిక్కుబడిపోయారు.