ఊరూ, వాడ ర్యాలీలు
ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
మార్మోగిన జై టీఆర్ఎస్..జైజై కేసీఆర్ నినాదాలు
డోలువాయిద్యాల చప్పుళ్ల మధ్య పార్టీ శ్రేణుల ఆటాపాట
నమస్తే తెలంగాణ, నెట్వర్క్:సురభి వాణీదేవి ఎమ్మెల్సీ విజయోత్సాహం ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కొనసాగింది. పల్లె, పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ర్యాలీలు, నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. విజయానికి సంకేతంగా ఊరు, వాడల్లో పటాకుల మోత మార్మోగింది. ప్రజాప్రతినిధులు, నాయకులు ఒకరికొకరు స్వీట్లను తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జై టీఆర్ఎస్.. జైజై కేసీఆర్… అభివృద్ధికే పట్టాభిషేకం… అన్న కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. సీఎం కేసీఆర్ పాలనాదక్షత, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో పట్టభద్రుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో వాణీదేవి ఘన విజయం సాధించిందని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డోలు వాయిద్యాల చప్పుళ్ల మధ్య పార్టీ శ్రేణుల ఆటాపాట ఆకట్టుకున్నది.
కడ్తాల్ మార్చి 21: రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల పెన్నిధి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన సందర్భంగా, ఆదివారం కడ్తాల్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేసినా పట్టభద్రులు టీఆర్ఎస్కే మద్దతు తెలిపారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాచిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరయ్య, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, నాయకులు గంప శ్రీను, లాయక్అలీ, నర్సింహ, జంగయ్యగౌడ్, సంతోశ్నాయక్, అంజి, ఇర్షాద్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 21 : ఎమ్మెల్సీగా సురభి వాణిదేవి గెలుపుతో ఇబ్రహీంపట్నంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టారు.
ఎన్నికలేవైనా టీఆర్ఎస్దే విజయం
కొడంగల్, మార్చి 21: రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే విజయమని ఎమ్మెల్సీ ఎన్నికలతో స్పష్టత ఏర్పడిందని టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మధసూదన్యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ఘన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు సయ్యద్ అంజద్, పకీరప్ప, మున్సిపల్ కౌన్సిలర్ వెంకట్రెడ్డి, పీఆర్టీయూ నాయకులు అబ్దుల్హక్, యాదగిరి, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మాజీ సర్పంచ్ రమేశ్బాబు, టీఆర్ఎస్ నాయకులు సాయిలు, నవాజుద్దీన్, వెంకట్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్లో..
తుర్కయాంజాల్, మార్చి21: తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలోని సాగర్ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం ర్యాలీ నిర్వహించి సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు కల్యాణ్నాయక్, కీర్తన, విజయానందరెడ్డి, లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, ముత్యంరెడ్డి, దశరథ, సుధాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, బాలనరసింహం, స్వామిగౌడ్, బాబయ్య, నిరంజన్రెడ్డి, శంకర్, రమేశ్, వినోద్, రాజిరెడ్డి, కార్తిక్కుమార్ పాల్గొన్నారు.
తాటిపర్తిలో..
యాచారం, మార్చి21: మండలంలోని తాటిపర్తి గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు పీఏసీఎస్ డైరెక్టర్ మద్దెల శశికళ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జోరుగా సంబురాలు జరుపుకున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పటాకులు పేల్చారు.
మంచాల మండలంలో..
మంచాల మార్చి 21: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించడంతో మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చీరాల రమేశ్, పుల్లారెడ్డి, జగన్రెడ్డి, కిషన్రెడ్డి, సత్యనారాయణ, బద్రినాథ్, జానీపాషా, కందాల శ్రీశైలం పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, ర్యాలీలు చేపట్టి సంబురాలు చేసుకున్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పట్టభద్రులు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్దే విజయమని చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలను అందజేసి సంబురాలు చేసుకున్నారు.
ఎమ్మెల్సీగా వాణీదేవి గెలుపు హర్షణీయం
కులకచర్ల, మార్చి 21: ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి గెలుపొందడం హర్శణీయమని డీసీసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆమె విజయానికి సహకరించిన పట్టభద్రులు, పీఆర్టీయూ నాయకులు, ఇతర ఉద్యోగులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఓట్లువేసి గెలిపించారన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదన్నారు.