పాట్నా, సెప్టెంబర్ 25: కులాలవారీగా బీసీల జనగణన చేపట్టాలన్న డిమాండ్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా బీజేపీయేతర నాయకులకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లేఖ రాశారు. ఓబీసీ, ఈబీసీల జనగణనను కులాల వారీగా చేపట్టడం కష్టమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో తేజస్వి లేఖ రాయడం గమనార్హం. ఈ విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావుతోపాటు బీజేపీయేతర ముఖ్యమంత్రులకు తేజస్వి లేఖను పంపారు.