చిక్కడపల్లి, జూన్19: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి దిశగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఆశవర్కర్లకు వేతనాలు పెంచిన సందర్భంగా శనివారం ఆంధ్రకేఫ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్తో కలిసి క్షీరాభిషేకం చేశారు. ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, గుండు జగదీశ్ బాబు, రాకేశ్ కుమార్, ఆకుల శ్రీనివాస్, పరశురాం, మారిశెట్టి నర్సింగ్రావు, రవి శంకర్ గుప్తా, పున్న సత్యనారాయణ, హనుమంతు, శివ సింహ, ఎస్టీ ప్రేమ్, సుధాకర్, సంతోష్, భాస్కర్రెడ్డి, పాశం రవి, భాస్కర్, అభిలాశ్, ప్రదీప్, కిరణ్కుమార్, సురేశ్ పాల్గొన్నారు.