మన్సూరాబాద్, జూన్ 24: నగరానికి ముఖ ద్వారమైన ఎల్బీనగర్ రింగ్రోడ్డు ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఎల్బీనగర్ రింగ్రోడ్డు నుంచి చింతలకుంట మార్గంలో రోడ్డుకిరువైపులా చేపట్టిన పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రింగ్రోడ్డు నుంచి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సేదతీరేందుకు సిట్టింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు సెల్ఫోన్లు చార్జింగ్ పెట్టుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ రింగ్రోడ్డు నుంచి చింతలకుంట వరకు చేపట్టిన పనులు పూర్తయిన వెంటనే బైరామల్గూడ నుంచి టీకేఆర్ కమాన్, సాగర్ రింగ్రోడ్డు నుంచి ఎల్బీనగర్ రింగ్రోడ్డు మీదుగా నాగోల్ వరకు రోడ్డుకిరువైపులా సుందరీకరణ పనులు చేపట్టి రూపురేఖలు మారుస్తామని వివరించారు.