లక్నో : ఉన్నత సౌకర్యాలతో ప్రవేశపెట్టిన తేజస్ రైలు (Tejas Train) కూడా ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి వసూలు చేసిన ఫీజును వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. తేజస్ రైళ్ల నిర్వాహకులు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున అందజేశారు. తేజస్ రైలు పట్టాలకెక్కిన తర్వాత రెండేండ్లకు తొలిసారి ఆలస్యంగా నడిచాయి. దేశంలోనే ప్రైవేట్ నిర్వహణలో ప్రవేశపెట్టిన రైళ్లివి.
రైళ్లంటేనే ఆలస్యానికి ప్రతిరూపాలు. తేజస్ రైళ్లు అలా కావని ఘంటాపథంగా చెప్పుకున్నా.. పాత బండ్ల మాదిరిగానే ఆలస్యంగా నడిచి ప్రయాణికుల ఆగ్రహానికి ఐఆర్సీటీసీ గురైంది. ఈ నెల 21 న లక్నో నుంచి బయల్దేరిన తేజస్ రైలు.. రెండున్నర గంటలు ఆలస్యంగా ఢిల్లీ చేరింది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగా ఇలా ఆలస్యం జరిగిందని కారణాలు చెప్పినా ప్రయాణికుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఇలా ఆలస్యంగా నడిపినందుకుగాను తమ నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత వెనక్కి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దాంతో ఆరోజు రైళ్లో ప్రయాణించిన 1,574 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున మొత్తం రూ.3,93,500 ఐఆర్సీటీసీ చెల్లించింది.
2016 ఆగస్టులో వీటిని పట్టాలకెక్కించగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 7 వరకు మూతపడ్డాయి. ఈ రైళ్లు కేవలం లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్యలోనే ప్రవేశపెట్టారు. తేజస్ రైళ్ల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు జరుగుతుందని, దాని ఆపరేషన్లో ఎలాంటి సాంకేతిక లోపం ఉండదని ఈశాన్య రైల్వే చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా చెప్పారు. ఇప్పుడు ఆలస్యంతో భవిష్యత్లో నిఘా మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు.
జేమ్స్ బాండ్ మ్యూజిక్తో అలరించిన ముంబై పోలీసులు
మర్మాంగానికి సీల్.. యువకుడు మృతి
ఈ ఆహారాలు తీసుకోండి.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
తాలిబాన్ ఎన్ని ఆయుధాలు ఎత్తుకెళ్లిందో తెలియదు : పెంటగాన్
కాబూల్లో ఉక్రెయిన్ విమానం హైజాక్
ఆఫీస్ బోర్డు తొలగించిన హురియత్ నేతలు.. ఎందుకంటే..?
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..