హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులును ఆదేశించారు. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం సమావేశ మందిరం, శాసనసభ, శాసనమండలి ప్రాంగణాలను స్పీకర్ పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులుతో ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులు కొవిడ్ పరీక్షలు చేయించుకొనేందుకు ఏర్పాట్లుచేయాలని, కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రెండు సభల సభ్యులు ఒక్కచోటే కూర్చోవాలని, భౌతికదూరాన్ని పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలని సూచించారు. గవర్నర్ భద్రతాధికారుల బృం దం బుధవారం సాయంత్రం అసెంబ్లీ హాలును పరిశీలించింది. ఈనెల 12న సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎస్సోమేశ్కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బీఆర్కేభవన్లో ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమీక్షించిన ఆయన అసెంబ్లీ, మండలిలో పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పంపించాలని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఇపీటీఆర్ఐ)ను ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా అతి తక్కువ సమయంలో ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసినందుకు అధికారులను అభినందించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్వులు రాణికుముదిని, శాంతికుమారి, ముఖ్యకార్యదర్శులు కే రామకృష్ణారావు, అర్వింద్కుమార్, సునీల్శర్మ, వికాస్రాజ్, రజత్కుమార్, సబ్యసాచి ఘోష్, రవిగుప్త, కార్యదర్శులు సందీప్కుమార్ సుల్తానియా, రిజ్వి, శేశాషాద్రి, రొనాల్డ్ రోస్, రాహుల్బొజ్జా, క్రిస్టినాచొంగ్తు, నదీమ్ అహ్మద్, జనార్దన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, అనితారాజేంద్ర, శ్రీనివాసరాజు, సర్ఫరాజ్అహ్మద్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి పాల్గొన్నారు.