చిదంబరం: క్లాసులకు సరిగా రావడం లేదని ఒక విద్యార్థిపై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతన్ని కింద పడేసి జుట్టు పట్టుకొని కాళ్లతో తంతూ హింసించాడు. అదే తరగతిలోని మరో విద్యార్థి ఈ ఘటనను వీడియో తీయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని చిదంబరం ప్రాంతంలో జరిగింది.
ప్రభుత్వ పాఠశాలకు చెందిన సదరు విద్యార్థి క్లాసులకు సరిగా రావడం లేదు. అందుకే అతను తన తరగతికి రాగానే ఆ టీచర్ ఇలా విశ్వరూపం ప్రదర్శించినట్లు సమాచారం. ఈ హింసాత్మక ఘటనపై ఎంపీ కార్తీ చిదంబంరం స్పందించారు. ‘‘ఇలా కొట్టి హింసించడం సబబు కాదు. ఆ టీచర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలి’’ అని ట్వీట్ చేశారు.