అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా జులై-ఆగస్ట్ మాసాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ను ప్రకటించడం ద్వారా మనం దాదాపు ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలనే లక్ష్యాన్ని సత్వరమే చేరుకుంటామని చెప్పారు. భారీ జనాభా కలిగిన దేశంలో ఉచిత వ్యాక్సినేషన్ సమకూర్చడం పెద్ద నిర్ణయమని అమిత్ షా అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దేశమంతటా ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ ఇప్పటికే అగ్ర భాగాన ఉన్నదని అమిత్ షా పేర్కొన్నారు. మనం ప్రస్తుతం మనం పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసే లక్ష్యానికి చేరువగా వెళుతున్నామని అన్నారు.