న్యూఢిల్లీ: రక్షణ శాఖ 56 సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ల కోసం స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా 16 ఎయిర్క్రాఫ్ట్లను 48 నెలల్లో ఎగరడానికి సిద్ధంగా ఉన్న కండిషన్లో ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇస్తుంది. ఇక మిగతా 40 విమానాలను ఇండియాలోనే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో కలిసి ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేస్తుంది.
ఈ సీ-295 ఎండబ్ల్యూ ఎయిర్క్రాఫ్ట్ సామర్థ్యం 5-10 టన్నులు. దీనిని రవాణా కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉన్న ఏవీఆర్వో-748ల స్థానంలో వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ ఇండియాలో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేసే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.