చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కమల్ హాసన్ కు మరో షాక్ ఎదురైంది. ఎంఎన్ఎం కీలక నేత సీకే కుమారవేల్ పార్టీని వీడారు. హీరో ఆరాధన, వ్యక్తి పూజను వ్యతిరేకిస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం ఒక్క సీటు కూడా గెలుపొందలేదు.
ఇక కోయంబత్తూర్ (సౌత్) నుంచి ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ సైతం ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు కమల్ పార్టీని వీడారు. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి ఎంఎన్ఎం ఉపాధ్యక్షుఎడు ఆర్ మహేంద్రన్, ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు, పద్మ ప్రియ పార్టీని వీడారు.