న్యూఢిల్లీ: భారత దిగ్గజ స్ప్రింటర్, 1958 కామెన్వెల్త్ స్వర్ణ పతక విజేత మిల్కా సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలడంతో ప్రస్తుతం చండీగఢ్లోని తన నివాసంలో 91 ఏండ్ల మిల్కా ఐసొలేషన్లో ఉన్నాడు. మా ఇంట్లో ఇద్దరు పనివాళ్లకు తొలుత కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులందరం పరీక్షలు చేయించుకున్నాం. నాకు మాత్రమే పాజిటివ్ రావడంతో ఆశ్చర్యపోయా. నాకు జ్వరం, దగ్గు లాంటి లక్షణాలేవీ లేవు. క్షేమంగా ఉన్నా. నాకు 91 ఏండ్లయినా ప్రతీరోజు వ్యాయామం చేస్తా అని మిల్కా సింగ్ గురువారం వెల్లడించాడు.