వైరస్ సోకని గొల్లపల్లి, చైన్పాక గ్రామాలు
సెకండ్ వేవ్లో ఒక్క పాజిటివ్ కేసూ లేదు
పక్కాగా అమలవుతున్న నిబంధనలు
ఫలితమిస్తున్న ముందుజాగ్రత్త చర్యలు
దేవరుప్పుల/చిట్యాల, మే 13 : రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ గ్రామగ్రామాన విస్తరిస్తుండగా దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామంలో నేటికీ ఒక్క కేసు నమోదు కాలేదు. గ్రామాల్లో సెకండ్ వేవ్ భయాందోళనలు సృష్టిస్తుంటే ఇక్కడ మాత్రం గత నాలుగు నెలలుగా ఒక్కరికి కూడా పాజిటివ్ లేదు. చిన్న ఊరు కావడంతో గ్రామ పంచాయతీ చెప్పినట్లు కొవిడ్ నిబంధనలను అక్కడి ప్రజలు పక్కాగా పాటిస్తున్నారు. ఈ గ్రామంలో జనాభా వెయ్యి దాకా ఉండగా అందరూ ఆర్యోగంగా ఉండడం వారి అదృష్టమే. అయితే ఫస్ట్ వేవ్లో ముగ్గురు కరోనా బారినపడగా, అప్పటినుంచి అప్రమత్తమై మళ్లీ ఎవ రూ వైరస్ బారినపడకుండా కట్టడి చేశారు. పరిశుభ్రత విషయంలో ఒకడుగు ముందున్న ఈ గ్రామం.. పదేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం అందించే నిర్మల్ గ్రామీణ్ పురస్కార్ అవార్డును దక్కించుకుంది. చైన్పాక. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఈ గ్రామంలో 110 ఇండ్లు, 436 జనాభా. వ్యవసాయమే ఆధారం. రైతు లు, కూలీలు ఎక్కువగా ఉండే ఊరిలో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలవుతు
బంధువులు, కొత్త వాళ్లకు అనుమతి లేదు పాలకవర్గం, ప్రజల అవగాహనతో ఆరోగ్యంగా పల్లె జనంన్నాయి.
పొలం , నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరిస్తారు. గ్రామంలోకి బంధువులను రానివ్వరు. ఇతర ప్రాంతాలను నుంచి వచ్చిన వ్యక్తులతో అంతగా సంబంధాలను కొనసాగించరు. అందుకే ఈ గ్రామంలో ఒక్క కేసూ నమోదు కాలేదు. జీపీ సిబ్బంది ప్రతి వీధిలో శానిటేషన్, హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఇటీవల గ్రామంలో కరోనా లక్షణాలు ఉన్న ఇద్దరికి టెస్టు చేసినా నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు గ్రామస్తులు చెప్పారు.
నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు..
కరోనా నిబంధనలు పక్కాగా పాటించడంలో మా గ్రామం ముందుంది. పండుగులు, పబ్బాలకు దూరంగా ఉండాలని అందరికీ చెప్పాం. చుట్టాలుపక్కాలను పిలవొద్దని, కరోనాతో కష్టపడే బదులు రాకుండా చూసుకుందామని ఒకటిరెండు సార్లు నూరిపోశాం. మాస్కు పెట్టకుంటే దండుగ వేస్తాం. పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు శానిటైన్ చేయిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. ఎవరికీ జ్వరాలు కూడా లేవు. కరోనాపై యువత వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ముందుజాగ్రత్త చర్యలు చెబుతున్నారు. క్రమం తప్పక చాటింపు కూడా వేయిస్తున్నం. ఇదే మా విజయ రహస్యం అనుకుంటున్నాం.
కోనేటి సుభాషిణి, సర్పంచ్
ముందుజాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నం
కరోరా వ్యాపించకుండా పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేయిస్తున్నాం. ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. ప్రతి మురుగుకాలువను రోజూ శుభ్రం చేయిస్తున్నాం. శానిటైజేషన్ పక్కాగా చేస్తున్నాం. గ్రామంలో కరోనాపై పూర్తి అవగాహన ఉండడం వల్లే కేసులు నమోదు కావడం లేదు. మాస్కులు పెట్టకుండా ఏ ఒక్కరూ బయటకు రారు. ఇప్పటికే 45 సంవత్సరాలు నిండిన వారిలో 50శాతం మంది టీకాలు వేసుకున్నారు.
గుగులోతు పాండు, పంచాయతీ కార్యదర్శి