హిందీని మాపై ఎందుకు రుద్దుతున్నారు?

చెన్నై: హిందీని తమిళ ప్రజలు ఎంతలా ద్వేషిస్తారో మరోసారి రుజువైంది. ఇప్పుడు అక్కడి సోషల్ మీడియా భారత వాతావరణ శాఖపై అంతెత్తున లేస్తోంది. ఓవైపు నివార్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న సమయంలోనూ తమిళ నెటిజన్లు మాత్రం హిందీ వ్యతిరేక ఉద్యమానికి మరోసారి తెర తీశారు. దీనంతటికీ కారణం.. నివార్ తుఫాన్ గురించి భారత వాతావరణ శాఖ హిందీలో సమాచారం ఇవ్వడమే. తన ట్విటర్ ఖాతాలో ఈ తీవ్రమైన తుఫాన్ గురించి హిందీలో సమాచారం ఇచ్చింది వాతావరణ శాఖ. అది చూసిన తమిళ ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. హిందీని మాపై ఎందుకు రుద్దుతున్నారు? ఆ భాష తప్ప మరో భాష లేదా? ఇంగ్లిష్ లేదా తమిళంలో వాతావరణ శాఖ సమాచారం ఇవ్వొచ్చుగా అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. మీ పేరును హిందీ వాతావరణ శాఖగా మార్చుకోండని ఒకరు.. ఫ్రెంచ్ అయినా సరేగానీ హిందీ ఎందుకు అని మరొకరు.. దీనికోసం తమిళనాడు ప్రజల ట్యాక్స్లను ఎందుకు వాడుతున్నారంటూ ఇంకొకరు.. ఇలా భారత వాతావరణ శాఖపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Mention it as 'Hindi Meteorolagical Department'.
— தமிழ் இடையன் (@thamizhidayan) November 25, 2020
If Indian government do this type of hindi imposition again and again, we tamil people says again and again that 'WE ARE NOT A INDIAN'. #stopHindichauvinism #stopHindiImposition https://t.co/7qkYud9dT7
You should be tweeting this in Tamil English and maybe French #stopHindiImposition https://t.co/0mALeEDDMi
— Poongulali (@poopoonga) November 24, 2020
To whom this message? It's just a news for North Indians, but isn't this warning to those who are on the path of the storm and will affect? When the tax money of tamilans is sweet, then why only our welfare is being squandered? @Indiametdept#stopHindiImposition pic.twitter.com/V3ZKaHn2se
— HabeeburRahman (@HabeeburRahmanZ) November 25, 2020
తాజావార్తలు
- ‘సిగ్నల్’లో సాంకేతిక సమస్యలు
- టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..
- తెలంగాణ క్యాడర్కు 9 మంది ఐఏఎస్లు
- నాగోబా జాతర రద్దు
- బైడెన్ ప్రమాణస్వీకారం రోజు శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్
- హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ
- నేటి నుంచి గొర్రెల పంపిణీ
- రాష్ట్రంలో చలి గాలులు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని