National
- Dec 03, 2020 , 14:59:52
VIDEOS
‘రాత్రి కర్ఫ్యూ విధించండి’

బెంగళూరు : కర్ణాటకలో రెండో దశ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన మధ్య కర్ణాటకలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ సుదర్శన్ ఈ మేరకు ముఖ్యమంత్రి యడ్యూరప్పకు నివేదికను సమర్పించారు. రెండో దశ కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకరమని నివేదికలో హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన సంవత్సర వేడుకలకు అవకాశం కల్పించవద్దని సూచించారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు రిసార్ట్స్, హోటళ్ళు, రోడ్లపై (ఎంజీ రోడ్, బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్) తదితర ప్రాంతాల్లో బహిరంగ నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలని కోరారు. రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచించారు. అలాగే కొవిడ్-19 మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: వాణీదేవి
- డీఎంకేతో పొసగని కాంగ్రెస్ పొత్తు.. కూటమిలో కొనసాగేనా?
- లంచ్ టైమ్.. ఇంగ్లండ్ 74/3
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్మహల్కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
MOST READ
TRENDING