న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో అవినీతి ద్వారా భారత్ రూ 21,000 కోట్లు నష్టపోయిందని మోదీ సర్కార్పై కాంగ్రెస్ శుక్రవారం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్డీయే రఫేల్ డీల్ ద్వారా దేశ ఖజానాకు తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. ఈ ఒప్పందంలో అవినీతిపై గతంలో రాహుల్ గాంధీ పదేపదే చెప్పిన విషయం ఇప్పుడు నిజమని రుజువైందని అన్నారు.
రఫేల్ ఒప్పందంలో భారత దళారీకి మిలియన్ యూరోల ముడుపులు ముట్టాయని ఫ్రెంచ్ మీడియా కథనాల నేపథ్యంలో రణ్దీప్ సుర్జీవాలా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రఫేల్ ఒప్పందంలో అవినీతిపై ఫ్రెంచ్ మీడియా వెల్లడించిన అంశాలను నిరాధార ఆరోపణలుగా బీజేపీ తోసిపుచ్చింది.