కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం చింతకుంట వద్ద రూ. 1.70 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాలను తీసుకువచ్చారన్నారు.
ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుగా చేసేందుకు నూతన రహదారులను నిర్మాణం చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలతో పాటుగా, అనేక అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమాలో జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, నాయకులు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ