చెన్నై: తమిళనాడుకు చెందిన ఒక విద్యార్థి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గుడ్డు పెంకులపై పలు కార్టూన్ చిత్రాలు గీసి తన ప్రతిభను చాటుకున్నాడు. కోయంబత్తూర్కు చెందిన సంజయ్ అనే విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల తరగతులు లేక పోవడంతో అతడికి ఏమీ తొచలేదు. దీంతో ఖాళీ సమయాన్ని చిత్రాలు గీయడానికి వినియోగించాడు. ప్రతి రోజు గుడ్లు తినే అతడు వాటి పెంకులను భద్రపరిచేవాడు. అనంతరం ఆ గుడ్ల పెంకులపై వాటర్ కలర్స్తో కార్టూన్ చిత్రాలను గీచాడు. ఇలా ఇప్పటి వరకు వందకుపైగా కార్టూన్ చిత్రాలు గీచినట్లు సంజయ్ తెలిపాడు. కాగా, అతడి ప్రతిభను తల్లిదండ్రులతోపాటు స్థానికులు మెచ్చుకున్నారు.