చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 7,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 189 మంది కరోనాతో మరణించారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,29,924కు, మొత్తం మరణాల సంఖ్య 31,386కు చేరింది. ప్రస్తుతం 61,329 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 15,281 మంది కరోనా రోగులు కోలుకున్నారని, కోలుకున్న వారి మొత్తం సంఖ్య 23,37,209కు చేరినట్లు వెల్లడించింది.