చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 24 గంటల్లో కొత్తగా 28,978 కేసులు, 232 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో అత్యధికంగా చెన్నైకి చెందినవారే ఉన్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే 20,904 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,52,389కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,09,237కు పెరిగింది. తమిళనాడులో సోమవారం నుంచి రెండు వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.