చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నది. ప్రతిరోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 33,658 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,65,035కు చేరింది.
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 303 మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి తమిళనాడులో మొత్తం కరోనా మరణాల సంఖ్య 17,359కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 20,905 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 13,39,887కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో 2,07,789 యాక్టివ్ కేసులు ఉన్నాయి.