చెన్నై: తమిళనాడులో కొనసాగుతున్న లాక్డౌన్ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. టాక్సీలు, ఆటోలు నడుస్తాయని వెల్లడించింది. అలాగే ప్రభుత్వ పార్కులు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారు.
మరోవైపు తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రొవిజన్ స్టోర్లు, కూరగాయల దుకాణాలు, మాంసం, చేపల దుకాణాలు, పూలమ్ముకునే వారిని అనుమతిస్తామని తాజా ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.