న్యూఢిల్లీ: గర్భిణులకు కరోనా టీకా కార్యక్రమంలో తమిళనాడు ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.27 లక్షల మంది గర్భిణులు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పొందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. 78,838 మంది గర్భిణులకు టీకాలు వేయడం ద్వారా తమిళనాడు ముందంజలో ఉన్నదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 34,228 మందికి, ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్లో 21,842 మందికి, కేరళలో 18,423 మందికి, కర్ణాటకలో 16,673 మంది గర్భిణులకు టీకా తొలి డోసు వేశారని, ఈ రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.