నందిపేట్, ఏప్రిల్ 2 : ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో జె. రమేశ్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున అనుమానం కలిగిన వా రంతా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. శుక్రవారం 50 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. వైద్యాధికారి అజయ్కుమార్, పీహెచ్వో దేవన్న, హెచ్ఈవో సాయికుమార్ తదితరులు ఉన్నారు.
దేగాం వ్యాక్సినేషన్ కేంద్రం తనిఖీ
మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45 సంవత్సరాలు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ను శుక్రవారం నుంచి ప్రారంభించామని తెలిపారు. ఆయన వెంట దేగాం వైద్యాధికారి భాస్కరరావు, హెచ్వోలు కాంతయ్య, రవి, సబ్ యూనిట్ అధికారి సాయి, పీహెచ్ఎన్ స్వరూప, సూపర్వైజర్లు సుభాష్, అజీమ్ తదితరులు ఉన్నారు.
సాలూరాలో వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు
బోధన్ మండలం సాలూరా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ బుద్దెసావిత్రితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. కరోనా వైరస్ పట్ల జాగ్రతలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మాజీ కన్వీనర్ బుద్దెరాజేశ్వర్, సొసైటీ చైర్మన్ శివకాంత్పటేల్, బుయ్యన్ సురేశ్, డాక్టర్ రేఖ, ఎంపీటీసీ కండెల సవిత, ఉప సర్పంచ్ సాయిలు పాల్గొన్నారు.
టీకా తీసుకున్న టీఆర్ఎస్ నాయకులు
ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎడపల్లి మండల అధ్యక్షుడు న్యావనంది సుభాష్, ఠానాకలాన్ సర్పంచ్ భాస్కర్రెడ్డి తదితరులు టీకా వేయించుకున్నారు.
ఇవీ కూడా చదవండి..
ఆర్టిస్ట్ లండన్లో.. మహిళ నెదర్లాండ్స్లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
నింగిలోకి దూసుకెళ్లేందుకు భారత ఆస్ట్రోనాట్లు సిద్ధం
జర్మనీలో 5 రోజులు కఠిన లాక్డౌన్
అమెరికాలో మళ్లీ కాల్పులు.. పది మంది మృతి
భారత్ సహా విదేశీ విద్యార్థులను అనుమతించబోమన్న చైనా