చెన్నై : కొవిడ్-19 విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా కొవిడ్-19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి స్టాలిన్ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల ప్రోత్సాహక పథకంలో భాగంగా వైద్యులకు రూ. 30 వేలు, నర్సులు, ట్రైనీ వైద్యులకు రూ.20 వేలు, శానిటరీ కార్మికులు, సీటీ స్కాన్ విభాగం, అంబులెన్స్ వర్కర్లకు రూ.15 వేలను ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సులకు స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు.