ఏఐఏడీఎంకే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది : స్టాలిన్

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన తమిళనాడు సీఎంతోపాటు మంత్రులపై చర్య తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆయన గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు 97 పేజీల ఫిర్యాదు అందజేశారు. సీఎం యడప్పాడి పళనీస్వామితోపాటు క్యాబినెట్లోని ఏడుగురు మంత్రులు భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
అక్రమాలకు పాల్పడుతున్న సీఎం పళనీస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు ఎస్పీ వేలుమణి, పీ తంగమణి, ఆర్ కామరాజ్, సీ విజయ్ భాస్కర్, ఆర్బీ ఉదయ్ కుమార్, డీ జయకుమార్పై చర్యలు తీసుకోవాలని గతంలో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అందుకే తాము గవర్నర్ను కలిసి అవినీతి నిరోధక (సవరణ) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని, తక్షణ చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారని స్టాలిన్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం ఏఐఏడీఎంకే పాలన అవినీతిమయంగా మారిందని ఆయన చెప్పారు.
ఇవికూడా చదవండి..
కశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో ఫరూఖ్ కూటమి ఆధిక్యం
బిగ్ బాస్ సోహెల్కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష