చెన్నై: తమిళనాడులోని తమిరబారణి నది ఒడ్డున 3,200 ఏండ్ల నాటి నాగరికత ఆనవాళ్లు దొరికాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. తమిళనాడులోని శివకలాయ్ వద్ద తవ్వకాల్లో మట్టిపెంకుల్లో దొరికిన బియ్యాన్ని కార్బన్ డేటింగ్ విధానం ద్వారా పరీక్షించగా అవి క్రీస్తు పూర్వం 1,155 ఏండ్ల నాటివిగా తేలిందని చెప్పారు. దీనిని పోరుణాయ్ నాగరితకగా అభివర్ణించారు. పోరుణాయ్ అనేది తమిరబారణి పూర్వపు పేరు. తిరుణెల్వేలిలో రూ.15కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నట్టు స్టాలిన్ చెప్పారు. తమిళ సాంస్కృతిక మూలాలు కనుక్కోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా సహా భారత ఉపఖండంలో తవ్వకాలు చేపడతామని తెలిపారు.